‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ కథ బావుంది!
ABN , First Publish Date - 2020-12-27T11:02:51+05:30 IST
ఛాయాగ్రాహకుడు కె.వి. గుహన్ దర్శకత్వం వహించిన రెండో తెలుగు చిత్రం ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ ప్రీ-లుక్ను నందమూరి కల్యాణ్రామ్
![‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ కథ బావుంది!](https://media.chitrajyothy.com/appimg/galleries/2020122705291294/12272020053248n85.jpg)
ఛాయాగ్రాహకుడు కె.వి. గుహన్ దర్శకత్వం వహించిన రెండో తెలుగు చిత్రం ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ ప్రీ-లుక్ను నందమూరి కల్యాణ్రామ్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా గుహన్ ప్రయాణం నా ‘118’తో ప్రారంభమైనందుకు సంతోషంగా ఉంది. ఆయనేం చేసినా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ చిత్రకథ విన్నాను. చాలా బావుంది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘థ్రిల్లర్స్లో ఇదొక ట్రెండ్సెట్టర్ సినిమా అవుతుంది’’ అని చిత్రనిర్మాత డాక్టర్ రవి పి. రాజు చెప్పారు. అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ‘మిర్చి’ కిరణ్, సంగీతం: సిమన్ కె. కింగ్.