లగ్జరీ కారును అమ్మేయాలనుకున్న సుశాంత్.. వైరల్ అవుతున్న ఆడియో టేప్!
ABN , First Publish Date - 2020-08-31T19:51:50+05:30 IST
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది
![లగ్జరీ కారును అమ్మేయాలనుకున్న సుశాంత్.. వైరల్ అవుతున్న ఆడియో టేప్!](https://media.chitrajyothy.com/appimg/galleries/2020083102200542/08312020142116n42.jpg)
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్కు సంబంధించిన ఓ ఆడియో టేపు తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ఆర్థిక పరిస్థితి గురించి సుశాంత్ ఆవేదన చెందినట్టు ఆ టేపు ద్వారా తెలుస్తోంది.
ఈ ఏడాది జనవరిలో సుశాంత్, అతని మేనేజర్లు, రియా చక్రవర్తి మధ్య ఈ సంభాషణ జరిగింది. సుశాంత్ సంపాదనను ఎలా పొదుపు చేయాలనే దాని గురించి వారు చర్చించుకున్నారు. ఈ క్రమంలో తన లగ్జరీ కారును అమ్మేయాలనుకుంటున్నట్టు సుశాంత్ చెప్పాడు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునేందుకు గోవా వెళ్లాలనుకున్నాడు. తన మానసిక, ఆర్థిక పరిస్థితి గురించి సుశాంత్ కలవరపాటుకు గురైనట్టు ఆ టేప్ ద్వారా తెలుస్తోంది. ఈ ఆడియో టేప్లోని గొంతు సుశాంత్దేనని ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే ధ్రువీకరించారు.