సీసీసీకి రూ.5లక్షల విరాళం ప్రకటించిన సూపర్గుడ్ ఫిలింస్
ABN, First Publish Date - 2020-04-18T19:32:38+05:30
కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్డౌన్ నెలకొంది. ఈ పరిస్థితుల్లో పేదవారు, రోజువారి కూలీలకు ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి.
కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్డౌన్ నెలకొంది. ఈ పరిస్థితుల్లో పేదవారు, రోజువారి కూలీలకు ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వారిని ఆదుకోవడానికి సెలబ్రిటీలు తమ వంతుగా సాయాన్ని అందిస్తున్నారు. సినిమా రంగం విషయానికి వస్తే సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం’ అనే సంస్థ ఎర్పడిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ తరఫున ఆర్.బి.చౌదరి, ఎన్.వి. ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా 5లక్షల విరాళాన్ని అందించారు ఈ ఐదు లక్షల రూపాయలను శుక్రవారంరోజున ఆర్టీజీఎస్ ద్వారా సీసీసీ కి పంపించారు.