ఈ నాటి స్టార్ హీరోయిన్ల తల్లులు కూడా సినీ తారలే..!
ABN , First Publish Date - 2020-02-12T20:06:22+05:30 IST
ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో.. హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. అయితే ఇప్పుడొస్తున్న సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాముఖ్యత సంగతి పక్కన పెడితే వారిని కేవలం గ్లామరస్ కోణంలో దర్శకనిర్మాతలు చూస్తున్నారు.

ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో.. హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. అయితే ఇప్పుడొస్తున్న సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాముఖ్యత సంగతి పక్కన పెడితే వారిని కేవలం గ్లామరస్ కోణంలో దర్శకనిర్మాతలు చూస్తున్నారు. ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఏదో ఒకటీ అరా సినిమాలలో తప్పితే.. ఇప్పుడున్న హీరోయిన్లకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు లభించడం లేదు. సరే విషయానికి వస్తే అలనాటి నటీమణులు కొందరు వారి కూతుర్లను కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తారల యొక్క మొదటి చిత్రం, అలాగే ఆ తారల కుమార్తెల మొదటి చిత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
రాధ- కార్తీక, తులసి::
సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన తారల్లో రాధిక ఒకరు. అందం, నటన, డ్యాన్స్.. అన్నీ ఆమెను అగ్రతారను చేశాయి. చిరంజీవి-రాధ కాంబినేషన్ అంటే అప్పట్లో హిట్టు పక్కా అనేలా ఉండేది. అలాంటి రాధ నటించిన తొలి చిత్రం అలైగల్ ఓఇవతిల్లై అనే తమిళ చిత్రం. ఇందులో కార్తీక్ సరన ఆమె నటించారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం ‘మిస్టర్ విజయ్’. ఇందులో హీరో శోభన్బాబు. ఇక ఆమె కూతురు కార్తీక హీరోయిన్గా అరంగేట్రం చేసిన చిత్రం ‘జోష్’. నాగచైతన్య హీరో. రాధ రెండో కూతురు తులసి కూడా హీరోయన్గా నటించారు. ఆమె మొదటి చిత్రం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కడల్’. తెలుగులో ‘కడలి’ అనే టైటిల్తో విడుదలైంది.

వేదవల్లి (సంధ్య)- జయలలిత:
జయలలిత పేరు అందరికీ తెలిసే ఉంటుంది కానీ వాళ్ల అమ్మ అయిన వేదవల్లి పేరు చాలా మందికి తెలియదు. ఆమె కూడా నటే. ఆమెను సంధ్య అని పిలిచేవాళ్లు. నటనపై నాకు మక్కువ పెరగడానికి కారణం మా అమ్మ వేదవల్లే అని జయలలిత చాలా సందర్భాల్లో తెలిపారు. వేదవల్లి నటిగా ఎన్నో చిత్రాలలో నటించారు. మాయాబజార్, కృష్ణలీలలు వంటి చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. ఇక జయలలిత సినీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. ఆమె తొలి చిత్రం ‘వెన్నిర ఆడై’ అనే తమిళ చిత్రం. తెలుగులో ఆమె అక్కినేని నాగేశ్వరరావు సరసన ‘మనషులు మమతలు’ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేశారు.

లక్ష్మీ- ఐశ్వర్య:
‘జీవనాంశం’ అనే తమిళ చిత్రం ద్వారా నటిగా పరిచయమైన లక్ష్మీ.. నటిగా ఎన్నో పాత్రలలో మెప్పించారు. అయితే ఆమె బాలనటిగా నటించిన తొలి చిత్రం ‘శ్రీవల్లి’. ఇప్పటికీ ఆమె నటిగా మంచి మంచి పాత్రలు చేస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే లక్ష్మీ మదర్ కూడా నటే. ఆమె పేరు కుమారి రుక్మిణి. 100కి పైగా చిత్రాలలో ఆమె నటించారు. ఇక లక్ష్మీ కూతురు ఐశ్వర్య కూడా అందరికీ పరిచయమే. ‘అడవిలో అభిమన్యుడు’ తెలుగులో ఐశ్వర్య మొదటి చిత్రం. ‘ఓలియంబుకల్’ అనే మలయాళ చిత్రంతో ఆమె అరంగేట్రం చేశారు.

లిజీ- కళ్యాణి ప్రియదర్శన్:
మలయాళ నటి లిజీ తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి గుర్తింపు పొందారు. ఇటీవల వచ్చిన నితిన్ ‘ఛల్ మోహన్ రంగా’ చిత్రంతో క్యారక్టెర్ ఆర్టిస్ట్గా రీ ఎంట్రీ ఇచ్చిన లిజీ మొదటి చిత్రం మలయాళంలోని ‘ఇతిరి నేరం ఒతిరి కార్యం’ అనే చిత్రం. ఇక ఆమె కూతురు కళ్యాణి ప్రియదర్శన్ కూడా హీరోయిన్గా అరంగేట్రం చేశారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘హలో’. అక్కినేని అఖిల్ సరసన ఆమె నటిగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం కళ్యాణి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో చిత్రాలు చేస్తోంది.

శ్రీదేవి- జాహ్నవి కపూర్:
అతిలోకసుందరిగా అందరూ పిలుచుకునే శ్రీదేవి సినీ జీవితం అనేక మలుపులు తిరుగుతూ చివరికి బాలీవుడ్ చేరింది. నటిగా ఎన్నో శిఖరాలను అధిరోహించిన శ్రీదేవి నిర్మాత బోనీకపూర్ని వివాహం చేసుకుని బాలీవుడ్లో సెటిలైన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. జాహ్నవి కపూర్. ఖుషి కపూర్. ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్గా పేరున్న శ్రీదేవి నటించిన తొలి చిత్రం ‘కాన్దాన్ కరుణై’. హీరోయిన్గా ‘16 వయతినిలే’. శ్రీదేవి కుమార్తెలలో జాహ్నవి కపూర్ కూడా హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘దడక్’. త్వరలో ఈ భామ టాలీవుడ్లో పరిచయం కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మంజుల- ప్రీతా, శ్రీదేవి, వనిత:
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసిన మంజుల నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. నటుడు విజయ్ కుమార్ని వివాహం చేసుకున్న ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ప్రీతా, శ్రీదేవి, వనిత. ముగ్గురిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మంజులు మొదటి చిత్రం ‘శాంతి నిలయం’ అనే తమిళ చిత్రం. ఆమె కూతురు ప్రీతా ‘రుక్మిణి’ అనే తెలుగు చిత్రంతో అరంగేట్రం చేశారు. మరో కూతురు శ్రీదేవి ‘రిక్షా మామ’ అనే తమిళ చిత్రంతో పరిచయమయ్యారు. మరో కూతురు వనిత ‘చంద్రలేఖ’ అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు.

అందంలో తనకు పోటీనే లేరు అనేలా గుర్తింపు పొందిన హేమమాలిని నటిగా, డైరెక్టర్గా, నిర్మాతగా, హేమమాలిని- ఈషా డియోల్, ఆహానా డియోల్:డ్యాన్సర్గా, రాజకీయ నాయకురాలిగా పలు పాత్రలను దిగ్విజయంగా పోషించారు. ఆమె నటిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘ఇతు సతియం’ అనే తమిళ చిత్రం. ఇక ఆమె కూమార్తెలు ఈషా డియోల్, ఆహానా డియోల్ కూడా నటీమణులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో ఈషా డియోల్ నటించిన తొలి చిత్రం ‘కోయి మేరే దిల్ సే పూచ్చీ’ అనే బాలీవుడ్ చిత్రం. రెండో కూతురైన ఆహానా డియోల్ ‘నా తుమ్ జానో నా హమ్’ అనే బాలీవుడ్ చిత్రంతో తెరంగేట్రం చేశారు

పుష్పవల్లి- రేఖ:
రేఖ.. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి జనరేషన్కి ఏమోగానీ.. ఒకప్పుడు రేఖ అందరికీ అభిమాన తార. నటిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన రేఖ బాల నటిగా తెలుగు చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆమె బాలనటిగా నటించిన తొలి చిత్రం ‘ఇంటిగుట్టు’. రేఖ మాత్రమే కాదు.. వాళ్ల అమ్మగారైన పుష్పవల్లి కూడా నటే. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పుష్పవల్లి ‘సంపూర్ణ రామాయణం’ అనే చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేశారు.

సారిక- శృతిహాసన్, అక్షర హాసన్:
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ భార్యగా సారిక అందరికీ తెలుసు. కమల్ హాసన్, సారిక కుమార్తెలైన శృతిహాసన్, అక్షర హాసన్ కూడా నటీమణులుగా చెలామణీ అవుతున్నారు. 5 సంవత్సరాల వయసులో బాలుడి పాత్రలో నటించింది సారిక. బాలనటిగా ఆమెకు గుర్తింపునిచ్చిన చిత్రం మాత్రం హమ్రాజ్. ఇక శృతిహాసన్ విషయానికి వస్తే.. సౌత్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శృతి.. తిరిగి మళ్లీ ఇప్పుడు నటించేందుకు సిద్ధమయ్యారు. కమల్ హాసన్ నటించిన ‘హేరామ్’ అనే చిత్రంతో బాలనటిగా పరిచయమైన శృతి, బాలీవుడ్ ఫిల్మ్ ‘లక్’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అక్షర హాసన్ ‘షమితాబ్’ అనే చిత్రంతో అరంగేట్రం చేశారు.

మేనక- కీర్తి సురేష్:
నటి కీర్తిసురేష్ తల్లిగా ఇప్పుడు చెప్పుకుంటున్న మేనక ఒకప్పుడు అగ్రతార. నటిగానే కాకుండా పలు విభాగాల్లో ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఆమె అసలు పేరు పద్మావతి. స్ర్కీన్ నేమ్ మేనక. స్ర్కీన్ నేమ్తోనే ఆమె అందరికీ అభిమాన నటి అయ్యారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘రామయి వయసుక్కు వన్తుట్టా’ అనే తమిళ చిత్రం. తెలుగులో ‘పున్నామినాగు’ అనే చిత్రంలో పూర్ణిమ అనే పాత్రలో నటించారు. ఇక మేనక కూతురు కీర్తిసురేష్ ప్రస్తుతం మహానటిగా గుర్తింపబడుతున్నారు. బాలనటిగా పరిచయమైన కీర్తిసురేష్ లీడ్ రోల్లో చేసిన తొలి చిత్రం ‘గీతాంజలి’ అనే మలయాళ చిత్రం.

షర్మిలా ఠాగూర్- సోహా అలీ ఖాన్:
బేగం అయేషా సుల్తానా ఖాన్గా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్ నటించిన తొలి చిత్రం ‘అపుర్ సన్సార్’ అనే బెంగాళీ చిత్రం. షర్మిలా ఠాగూర్ కూతురు సోహా అలీ ఖాన్. ఆమె నటించిన తొలి చిత్రం ‘దిల్ మాంగే మోర్’. తక్కుత చిత్రాలలో నటించినప్పటికీ సోహా అలీఖాన్ నటిగా మంచి గుర్తింపునే పొందారు.

తనూజ- కాజోల్:
బాలీవుడ్ ప్రముఖ నటీమణులలో కాజోల్ పేరు ప్రముఖంగా వినిపించేది. బాలీవుడ్ని ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన కాజోల్ నటిగా ఎన్నో చిత్రాలలో తనదైన నటనతో మెప్పించారు. ఆమె తల్లి తనూజ నటవారసత్వాన్ని పొందిన కాజోల్ ఇప్పటికీ నటిగా నటిస్తూనే ఉన్నారు. కాజోల్ ‘బేఖుది’ అనే చిత్రంతో పరిచయమైతే.., ఆమె తల్లి తనూజ ‘హమారీ బేటీ’ అనే చిత్రంతో పరిచయమయ్యారు.

డింపుల్ కపాడియా- ట్వింకిల్ ఖన్నా:
రాజ్ కపూర్ పరిచయం చేసిన నటీమణుల్లో డింపుల్ కపాడియా ఒకరు. ఆమె నటించిన తొలి చిత్రం బాబీ. ఇక ఆమె కూతురు ట్వింకిల్ ఖన్నా నటిగా అందరికీ సుపరిచితమే. ట్వింకిల్ ఖన్నా నటిగానే కాకుండా కో ప్రొడ్యూసర్గానూ బాధ్యత నిర్వహించారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘బర్సాత్’.

బబితా కపూర్- కరీనా కపూర్, కరిష్మా కపూర్:
‘దుష్ లక్’ అనే చిత్రంతో నటిగా పరిచయమైన బబితా కపూర్ బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను వేసుకోగలిగారు. తన అందంతో, నటనతో బాలీవుడ్ని షేక్ చేసిన ఈ భామ మరో ఇద్దరు హీరోయిన్లను బాలీవుడ్కి ఇచ్చారు. అందులో ఒకరైన కరీనా కపూర్ ఇప్పటికీ బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగుతుంది. కరీనా కపూర్ నటించిన తొలి చిత్రం ‘రెఫుగి’. అలాగే బబిత మరో కూతురు కరిష్మా కపూర్ అరంగేట్రం చేసిన చిత్రం ‘ప్రేమ్ ఖైదీ’.

జీవితా రాజశేఖర్- శివాని, శివాత్మిక:
జీవితా రాజశేఖర్. ఈ పేరు అందరికీ సుపరిచితమే. హీరో, హీరోయిన్గా నటిస్తూనే పెళ్లి చేసుకున్న రాజశేఖర్, జీవిత దంపతులు.. ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వీరికి శివాని, శివాత్మిక అనే ఇద్దరు కుమార్తెలు. వారు కూడా నటీమణులుగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో ‘శివాత్మిక’ ఇప్పటికే నటిగా ‘దొరసాని’ అనే చిత్రంతో పరిచయమయ్యారు. మరో కుమార్తె శివాని పరిచయం అవుతున్న ‘2 స్టేట్స్’ చిత్రం సెట్స్పై ఉంది. ఇదిలా ఉంటే నటి జీవిత ‘అంకుశం’ చిత్రంతో నటిగా గుర్తింపుపొందారు.

నమ్రతా మహేష్- సితార:
నమ్రతా శిరోద్కర్. ప్రస్తుతం నటించకపోయినప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా నమ్రత ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటారు. ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాలకు సంబంధించి ఈ మధ్య ఆమె తీసుకున్న జాగ్రత్తలు మహేష్ అభిమానులను ఎంతగానో ఖుషీ చేస్తున్నాయి. ‘షిరిడీకే సాయిబాబా’ అనే చిత్రంతో బాలనటిగా పరిచయమైన నమ్రత నటిగా నటించిన తొలి చిత్రం మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత చేసిన ‘జాబ్ ప్యార్ కిసీసే హోతా హై’ చిత్రంలో ఆమె స్పెషల్ పాత్రలో కనిపించారు. ఇప్పుడామె కుమార్తె సితార ‘ఫ్రొజెన్ 2’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
