గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సోనూసూద్
ABN , First Publish Date - 2020-09-29T15:12:55+05:30 IST
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సోనూసూద్ భాగమయ్యారు.
![గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సోనూసూద్](https://media.chitrajyothy.com/appimg/galleries/2020092909395347/09292020094216n96.jpg)
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సోమవారం రామోజీ ఫిలిం సిటీలో జాతీయస్థాయిలో వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు, సినీ నటుడు సోనూ సూద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన తాను ఈరోజు మొక్కలు నాటినట్లు తెలిపారు.
సోనూసూద్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా, తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందన్నారు సోనూసూద్. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నేను ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని, ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూసూద్ పిలుపునిచ్చారు.