అత్త అయినా, కోడలు అయినా ఇంట్లో ఉండాల్సిందే : స్మృతి
ABN , First Publish Date - 2020-04-16T12:07:11+05:30 IST
ఏక్తా కపూర్ సీరియల్ క్యోమ్ కి సాస్ భీ కబీ బాహు థితో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నటి, బిజెపి మంత్రి స్మృతి ఇరానీ కరోనా వైరస్ పై ప్రజలకు...

ఏక్తా కపూర్ సీరియల్ క్యోమ్ కి సాస్ భీ కబీ బాహు థితో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నటి, బిజెపి మంత్రి స్మృతి ఇరానీ కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ షోలో తులసి పాత్రలో నటించిన స్మృతి తాజాగా తన షో కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ సీరియల్ పరిచయ పాటలో తులసి తలుపులు తెరిచి, ఆమె ఇంట్లో ఉన్న వారిని పరిచయం చేస్తుంది. అయితే, స్మృతి షేర్ చేసిన వీడియోలో ఆమె తలుపులు మూసివేస్తుంది. ఈ వీడియో ద్వారా స్మృతి అందరినీ ఇంట్లో ఉండమని సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఇంట్లో ఉండి, మీ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచండి. అత్త అయినా, కోడలు అయినా ఇంట్లో ఉండాల్సిందే అనే కామెంట్ వీడియో కింద రాశారు.
Read more