గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న నటుడు శివారెడ్డి
ABN , First Publish Date - 2020-07-31T14:31:46+05:30 IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి పాల్గొన్నారు. మణి కొండలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.
![గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న నటుడు శివారెడ్డి](https://media.chitrajyothy.com/appimg/galleries/202007310859291/07312020090119n54.jpg)
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి పాల్గొన్నారు. మణి కొండలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఒక యుద్ధంలా పర్యావరణ ప్రేమికులు అంతా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో తననూ భాగస్వామిని చేసిన, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు. ఈ సందర్భంగా హాస్యనటుడు ఆలీ, కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలహాసన్ రెడ్డి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, పాటల రచయిత కాసర్ల శ్యామ్ మరియు తన సోదరుడు కళాకారుడు సంపత్కు మూడు మొక్కలు నాటే ఛాలెంజ్ విసిరారు శివారెడ్డి.