గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నటుడు శివారెడ్డి

ABN , First Publish Date - 2020-07-31T14:31:46+05:30 IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి పాల్గొన్నారు. మణి కొండలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నటుడు శివారెడ్డి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి పాల్గొన్నారు. మణి కొండలోని తన  నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఒక యుద్ధంలా పర్యావరణ ప్రేమికులు  అంతా ముందుకు తీసుకెళ్తున్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో తననూ భాగస్వామిని చేసిన, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు. ఈ సందర్భంగా హాస్యనటుడు ఆలీ, కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలహాసన్ రెడ్డి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, పాటల రచయిత కాసర్ల శ్యామ్ మరియు తన సోదరుడు కళాకారుడు సంపత్‌కు మూడు మొక్కలు నాటే ఛాలెంజ్ విసిరారు శివారెడ్డి.

Updated Date - 2020-07-31T14:31:46+05:30 IST