సెట్లో శ్రుతీహాసన్
ABN , First Publish Date - 2020-10-09T05:04:17+05:30 IST
కరోనా, లాక్డౌన్ తర్వాత ఒక్కో హీరోయిన్ సెట్లో అడుగుపెట్టి షూటింగ్లతో బిజీ అవుతున్నారు. తాజాగా శృతీహాసన్ సెట్లో అడుగుపెట్టారు...
![సెట్లో శ్రుతీహాసన్](https://media.chitrajyothy.com/appimg/galleries/202010081129133/10082020233408n80.jpg)
కరోనా, లాక్డౌన్ తర్వాత ఒక్కో హీరోయిన్ సెట్లో అడుగుపెట్టి షూటింగ్లతో బిజీ అవుతున్నారు. తాజాగా శృతీహాసన్ సెట్లో అడుగుపెట్టారు. విజయ్సేతిుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘లాభం’ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయిక. లాక్డౌన్ వల్ల ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ గురువారం చెన్నైలో మొదలైంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, శృతీహాసన్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఎస్.పి. జననాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.