శ్రీవారి సేవలో శర్వానంద్‌, రష్మిక

ABN , First Publish Date - 2020-10-25T16:37:23+05:30 IST

విజయదశమి సందర్భంగా యువ కథానాయకుడు శర్వానంద్‌, హీరోయిన్‌ రష్మిక మందన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో శర్వానంద్‌, రష్మిక

విజయదశమి సందర్భంగా యువ కథానాయకుడు శర్వానంద్‌, హీరోయిన్‌ రష్మిక మందన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ కాంబినేషన్‌లో 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శర్వానంద్‌, రష్మిక తిరుమల విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు దర్శకుడు కిషోర్‌ తిరుమల, చిత్ర నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కూడా ఉన్నారు. అనంతరం చిత్రయూనిట్‌ ప్రేక్షకాభిమానులకు దసరా శుభాకాంక్షలను అందజేశారు. 


Updated Date - 2020-10-25T16:37:23+05:30 IST