శరత్ కుమార్ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-07-31T13:53:24+05:30 IST
తాజాగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన టుడు శరత్కుమార్కు ఇలాంటి ఓ చేదు ఘటన ఎదురైంది.
![శరత్ కుమార్ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు](https://media.chitrajyothy.com/appimg/galleries/2020073108192997/07312020082318n10.jpg)
ఎవరో ఒక సెలబ్రిటీ పేరు చెప్పి మోసం చేయడమనేది ఎక్కువైంది. పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తాజాగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన టుడు శరత్కుమార్కు ఇలాంటి ఓ చేదు ఘటన ఎదురైంది. ఆయన అప్రమత్తంగా ఉండి సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే.. శరత్ కుమార్ అఖిల భారత సమత్తుల కట్చి పేరుతో ఓ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ పేరు చెప్పి కోవైకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోసాలకు పాల్పడే విషయం శరత్ కుమార్ దృష్టికి వచ్చింది. శరత్ కుమార్ సదరు వ్యక్తితో నేరుగా మాట్లాడటమే కాకుండా చెన్నై కమీషనర్కు సదరు వ్యక్తిపై ఫిర్యాదు కూడా చేశారు.