గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సంపత్ నంది

ABN , First Publish Date - 2020-07-16T01:00:41+05:30 IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడతలో డైరెక్టర్ సంపత్ నంది పాల్గొన్నారు. ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి తన కుటుంబ సభ్యులతో కలిసి చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు సంపత్ నంది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సంపత్ నంది

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడతలో డైరెక్టర్ సంపత్ నంది పాల్గొన్నారు. ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి తన కుటుంబ సభ్యులతో కలిసి చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు సంపత్ నంది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. కాబట్టి  బాధ్యతగా  అందరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కోటి మొక్కలు నాటారు అని తెలిపినప్పుడు సంతోషించాను. అదేవిధంగా మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిమ్మప్ప జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటారు. కానీ మన సంతోష్ అన్న ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 కోట్లకు పైగా మొక్కలు నాటారు అని తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. మన సంతోష్ అన్నకు వారికి మించిన గౌరవం దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల మన మూతులకు మాస్కులు కట్టుకొని తిరుగుతున్నాం. భవిష్యత్తులో మన వీపులకు ఆక్సిజన్ సిలిండర్ వేసుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అందరం మొక్కలు నాటాలి’’ అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హీరోయిన్లు భూమిక చావ్లా, ఊర్వశి రౌతేలా, దిగంగన సూర్యవంశీ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని సంపత్ నంది తెలిపారు. 



Updated Date - 2020-07-16T01:00:41+05:30 IST