జనాభాను తగ్గించాలనుకుంటున్నారా: సల్మాన్ ఆగ్రహం
ABN, First Publish Date - 2020-04-16T17:58:03+05:30
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల పైకి అనవసరంగా వస్తున్న వారిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల పైకి అనవసరంగా వస్తున్న వారిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని, అందరు ఇళ్లకే పరిమితం కావాలని సూచించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేశాడు.
`మీరు దేశ జనాభాను తగ్గించాలనుకుంటున్నారా? ఈ పనిని మీ కుటుంబంతోనే మొదలు పెట్టాలనుకుంటున్నారా? డాక్టర్లు, నర్సులు తమ జీవితాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి వాళ్లపై రాళ్లు విసిరితే మీ ప్రాణాలను ఎవరు కాపాడతారు? ప్రార్థన చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లోనే చేసుకోండి. బయటకు వచ్చి మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను ఎందుకు ప్రమాదంలోకి నెడుతున్నారు?` అని ప్రశ్నించాడు. అలాగే ప్రజలను పోలీసులు కొట్టడంపై స్పందిస్తూ.. `ఇంట్లో ఉన్న వారిని పోలీసులు కొట్టడం లేదు కదా` అని సమాధానమిచ్చాడు. ఇక, కరోనా పాజటివ్ వ్యక్తులు ఆస్పత్రుల నుంచి పారిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. `వారు చావడానికి వెళ్తున్నారా లేక బతకడానికి వెళ్తున్నారా` అని ప్రశ్నించాడు.