రొమాంటిక్ డ్రామా
ABN , First Publish Date - 2020-02-14T09:23:18+05:30 IST
నాగశౌర్య, రీతూ వర్మ జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్లో మొదలైంది. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు...
![రొమాంటిక్ డ్రామా](https://media.chitrajyothy.com/appimg/galleries/2020021403515182/02142020035309n1.jpg)
నాగశౌర్య, రీతూ వర్మ జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్లో మొదలైంది. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19న ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించి ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత సూర్య దేవర నాగవంశీ చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాశ్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.