రకుల్కు కరోనా పాజిటివ్!
ABN , First Publish Date - 2020-12-22T20:14:32+05:30 IST
ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది.
![రకుల్కు కరోనా పాజిటివ్!](https://media.chitrajyothy.com/appimg/galleries/2020122202434253/12222020144418n4.jpg)
ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. తాజాగా చేయించుకున్న పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రకుల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని తెలిపింది.
`నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాను. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ మధ్య నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండ`ని రకుల్ పేర్కొంది.