10 రోజల క్రితం తల్లి పేరుతో పోస్ట్, ఫొటో షేర్ చేసిన సుశాంత్!
ABN , First Publish Date - 2020-06-15T16:50:41+05:30 IST
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని బాంద్రాలోగల తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో చిత్రపరిశ్రమకు చెందిన ప్రతీవారు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
![10 రోజల క్రితం తల్లి పేరుతో పోస్ట్, ఫొటో షేర్ చేసిన సుశాంత్!](https://media.chitrajyothy.com/appimg/galleries/2020061511183494/06152020111919n38.gif)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని బాంద్రాలోగల తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో చిత్రపరిశ్రమకు చెందిన ప్రతీవారు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా సుశాంత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవారు. సుశాంత్ 10 రోజుల క్రితం తన తల్లి గురించి ఒక పోస్ట్ పెట్టారు. అది ఇప్పుడు వైరల్గా మారింది. ఆ పోస్టులో సుశాంత్.... మసకబారిన గతమంతా కన్నీరుగా జారి ఆవిరైపోతోంది. అంతులేని కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని మలుస్తున్నాయి. ఈ రెండిటి మధ్యనే బతుకుతున్నాను... అమ్మా! అని రాశారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అతని తల్లి మరణించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ 1986 జనవరి 21 న బీహార్లోని పట్నాలో జన్మించారు. సుశాంత్ నటించిన చివరి సినిమా చందమామా డోర్ కే బడ్జెట్ లేకపోవడంతో షూటింగ్ ఆగిపోయింది.