రాజ్ పుత్` షూటింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-09-16T19:58:46+05:30 IST
బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై బంజార భాషలో `గోర్మాటి`గా.. తెలుగులో `రాజ్పుత్`గా రెండు భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రేఖ్యా నాయక్.
![రాజ్ పుత్` షూటింగ్ ప్రారంభం](https://media.chitrajyothy.com/appimg/galleries/202009160225442/09162020142827n68.jpg)
బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై బంజార భాషలో `గోర్మాటి`గా.. తెలుగులో `రాజ్పుత్`గా రెండు భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రేఖ్యా నాయక్. శంకర్ జాదవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అదిరే అభి మరో హీరోగా నటిస్తున్నారు. సిరిరాజ్, కరిష్మా రామ్ హీరోయిన్స్. ఈ చిత్రం బుధవారం ఫిలింనగర్లోని తెలంగాణ ఫిలించాంబర్ లో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలించాంబర్ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా ..తెలంగాణ `టీమా` సెక్రటరి వి.తిరుమల దేవి కెమేరా స్విచాన్ చేశారు. మరో అతిథి లక్మణ్ వేముల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా.
డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ''ఇటీవల కాలంలో బంజార భాషలో రూపొందిన చిత్రాలు విజయం సాధించాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాకు అన్నివిధాల నా పూర్తి సహకారం ఉంటుంది!" అన్నారు. దర్శకుడు, హీరో శంకర్ జాదవ్ మాట్లాడుతూ ''బంజారాల జీవితం ఎక్కడ ప్రారంభమై ఎక్కడెక్కడి వరకు వ్యాపించింది. అసలు వారి జీవన శైలి ఎలా ఉంటుంది అనే అంశాల ఇతివృత్తంతో తెలుగులో `రాజ్పుత్` , బంజారలో `గోర్మాటి`గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నేను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నా`` అన్నారు. నిర్మాత రేఖ్యా నాయక్ మాట్లాడుతూ "బంజార వారి స్థితిగతులతో పాటు వారి సమస్యలూ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బంజారాలు ఇప్పటికే నేను ప్రారంభించిన `యూట్యూబ్` ఛానల్ ని ఆదరించారు. ఈ సినిమాకు కూడా వారి పూర్తి సహకారం ఉంటుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా ఒక్క బంజార వాళ్లకే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూ ఆలోచింపజేసేలా ఉంటుంది. ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేస్తాం`` అన్నారు.