లాక్డౌన్లో ప్రియాంక... మాస్క్తో సెల్ఫీ!
ABN , First Publish Date - 2020-05-12T17:24:37+05:30 IST
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. కరోనా వైరస్ యుఎస్లోనూ తన ప్రతాపం చూపిస్తున్న విషయం విదితమే.
![లాక్డౌన్లో ప్రియాంక... మాస్క్తో సెల్ఫీ!](https://media.chitrajyothy.com/appimg/galleries/2020051211512765/05122020115418n64.gif)
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. కరోనా వైరస్ యుఎస్లోనూ తన ప్రతాపం చూపిస్తున్న విషయం విదితమే. అక్కడ లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండవలసి వస్తోంది. ఈ లాక్డౌన్లో ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ, పలు విషయాలు షేర్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా రెండు నెలల తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మాస్క్ ధరించి సెల్ఫీ తీసుకుని, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా కరోనా వైరస్పై చేస్తున్న పోరాటానికి నిధుల సేకరణకు చేపట్టిన కార్యక్రమంలో ప్రియాంక తన భర్త నిక్ జోనాస్తో కలిసి పాల్గొన్నారు.