గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ప్రగ్యా జైశ్వాల్‌

ABN , First Publish Date - 2020-12-30T01:39:26+05:30 IST

నటి పాయల్ రాజ్‌పుత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ప్రగ్యా జైశ్వాల్‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రముఖులు ఒకరి నుండి  ఒకరు చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడానికి ఉత్సాహం చూపుతున్నారు. నటి పాయల్ రాజ్‌పుత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "పకృతిని అందరూ ప్రేమించి బాధ్యతగా మొక్కలు నాటాలి. మొక్కల నుండి వచ్చే ఆక్సిజన్ తోనే మనం ఈ రోజు జీవనం కొనసాగిస్తున్నాం. మనకు ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆక్సిజన్‌ను మనం చాలా డబ్బులు ఖర్చు చేసి కొనుకుంటాం.  అలాంటి ఆక్సిజన్ ఉచితం గా ఇచ్చే మొక్కలను నాటి సంరక్షించే బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి మనిషి కనీసం మూడు మొక్కలు నాటాలి.  ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందు తీసుకబోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారికి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ వారికి అభినందనలు"అన్నారు. ఈ చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని అందులో భాగంగా సినీనటి రెజీనా కసండ్ర, డైరెక్టర్ బోయపాటి శ్రీను, అనుష్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి  మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు "వృక్ష వేదం" పుస్తకంను ప్రజ్ఞా జైస్వాల్ కు అందజేశారు. 

Updated Date - 2020-12-30T01:39:26+05:30 IST