బుల్లితెరపైనా.. అలరించలేకపోయిన ‘సాహో’
ABN , First Publish Date - 2020-10-30T01:52:54+05:30 IST
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'సాహో'. 'బాహుబలి' రెండు పార్ట్ల తర్వాత రిలీజ్ అవుతుండటంతో
![బుల్లితెరపైనా.. అలరించలేకపోయిన ‘సాహో’](https://media.chitrajyothy.com/appimg/galleries/202010290745534/10292020202241n7.jpg)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'సాహో'. 'బాహుబలి' రెండు పార్ట్ల తర్వాత రిలీజ్ అవుతుండటంతో.. విడుదలయ్యే సమయంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందు మాములుగా మొదలైన ఈ చిత్రం బాహుబలి సాధించిన అఖండ విజయంతో.. పాన్ ఇండియా ఫిల్మ్గా మారిపోయింది. భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్గా విడుదలైన ఈ చిత్రం ఒక్క బాలీవుడ్లో మినహా మిగతా అన్ని చోట్ల అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. చివరికి వెండితెరపై ఈ సినిమా పరాజయం పాలైన చిత్రంగానే బాక్సాఫీస్ రిపోర్ట్స్ వచ్చాయి.
ఇక తాజాగా ఈ చిత్రాన్ని బుల్లితెరపై వరల్డ్ ప్రీమియర్ షోగా ప్రసారం చేశారు. వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం బుల్లితెరపైనైనా రికార్డులు క్రియేట్ చేస్తుందని.. ప్రభాస్ అభిమానులు భావించారు. కానీ చిన్న స్క్రీన్పై కూడా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. స్టార్ హీరోల సినిమాలు మూడోసారి, నాలుగో సారి బుల్లితెరపై ప్రసారం అయితే ఎటువంటి టీఆర్పీ రేటింగ్స్ వస్తాయో.. అలాంటి టీఆర్పీని కూడా ఈ చిత్రం సాధించలేకపోయింది. ఈ చిత్రానికి వచ్చిన టీఆర్పీ చూసి ప్రభాస్ అభిమానులే కాదు.. ప్రసారం చేసిన ఎంటర్టైన్మెంట్ ఛానల్ వారు కూడా షాకవ్వడం విశేషం. ఈ చిత్రం 5.8 టిఆర్పి రేటింగ్ సాధించి.. బుల్లితెరపై కూడా పరాజయాన్ని చవిచూసిందనే వార్తలు బయటికి వచ్చాయి.