జయంత్ సి పరాన్జీ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్

ABN , First Publish Date - 2020-02-03T04:17:21+05:30 IST

ఆర్ఎక్స్ 100 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసి ‘వెంకీమామ’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్.. ప్రముఖ దర్శకుడు

జయంత్ సి పరాన్జీ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్

ఆర్ఎక్స్ 100 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసి ‘వెంకీమామ’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్.. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ లేటెస్ట్ మూవీ ‘నరేంద్ర’లో ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ ఫైటర్ పైలట్‌గా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. ఒక అమాయకుడైన భారతీయ బాక్సర్ పాకిస్థాన్ జైలులో ఎలా బందీ అయ్యాడు అక్కడి నుండి ఎలా తప్పించుకుని బయట పడ్డాడు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘నరేంద్ర’ చిత్రం ఉంటుందని చిత్రయూనిట్ తెలిపారు. చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్‌‌లో విడుదలకానుంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. ‘‘ఈ చిత్రం థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా అందరినీ మెప్పిస్తుంది. హీరోగా పరిచయం అవుతున్న నీలేష్ పాకిస్థాన్ జైల్‌లో ఖైదీ అయిన మాజీ బాక్సర్‌గా నటిస్తున్నారు. బ్రెజిలియన్ బ్యూటీ ఇసాబెల్లా లియేటి స్వేఛ్చా పోరాటానికి మద్దతు ఇచ్చే మానవ హక్కుల కార్యకర్త పాత్ర పోషిస్తుంది. అలాగే భారత ఖైదీలను రక్షించే ప్రయత్నంలో తనను తాను త్యాగం చేసుకునే ఆఫ్ఘన్ ఖైదీగా ఫేమస్ డబ్లూ.డబ్లూ.ఈ. స్టార్ ద గ్రేట్ ఖలి నటిస్తున్నారు.  ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావగారూ బాగున్నారా, లక్ష్మి నరసింహా, టక్కరి దొంగ, ఈశ్వర్, శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ సరికొత్త ట్విస్టులతో తెలుగు స్క్రీన్ మీద ఇంతవరకూ రాని అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరినీ అటెన్షన్‌కు గురిచేసిన పాయల్ రాజ్‌పుత్ ఈ చిత్రంలో ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ ఫైటర్ పైలట్‌గా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలెట్‌గా ఉంటుంది..’’ అని తెలిపారు. 

Updated Date - 2020-02-03T04:17:21+05:30 IST