రాష్ట్రపతికి పాయల్ లేఖ!
ABN , First Publish Date - 2020-10-12T20:19:52+05:30 IST
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తూ

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తూ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇటీవల ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని, తన కేసు విషయంలో ఇప్పటి వరకు పురోగతి లేదని తెలుపుతూ భారత రాష్ట్రపతికి పాయల్ తాజాగా ఓ లేఖ రాసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించింది.
`గతంలో నాపై జరిగిన లైంగిక దాడి గురించి ముంబై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నాకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి తన ఇంటికి పిలిపించుకుని నిందితుడు నన్ను వేధింపులకు గురి చేశాడు. ఈ విషయమై నేను 22-9-2020న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అయితే ఇప్పటివరకు ఈ కేసు విషయంలో పురోగతి లేదు. నిందితుడు ప్రముఖ వ్యక్తి కావడంతో పోలీసులు అతని జోలికి వెళ్లడం లేదు. ఇదే నేరం ఎవరైనా పేద వ్యక్తి చేసి ఉంటే ఈ పోలీసులు అదే రోజు అరెస్ట్ చేసి ఉండేవారు. కానీ, నా కేసులో నిందితుడు ప్రముఖుడు. అందుకే స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. బాధితురాలినైన నేను న్యాయం కోసం అందరి తలుపులూ తడుతున్నాను. ఈ కేసులో జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాన`ని పాయల్ ఆ లేఖలో పేర్కొంది. ఆ లేఖను తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
Read more