మరోసారి క్రిష్‌ చిత్రానికి...

ABN , First Publish Date - 2020-08-19T05:40:47+05:30 IST

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ‘వేదం’, ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ రెండు భాగాలకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. మరోసారి వీళ్లిద్దరూ...

మరోసారి క్రిష్‌ చిత్రానికి...

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ‘వేదం’, ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ రెండు భాగాలకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. మరోసారి వీళ్లిద్దరూ కలిసి పని చేస్తున్నారు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ జంటగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ప్రస్తుతం వికారాబాద్‌ అడవుల్లో చిత్రీకరణ జరుగుతోంది. సినిమా అంతా అటవీ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ చేస్తున్న చిత్రానికీ కీరవాణి సంగీతం అందిస్తారని వినికిడి.


Updated Date - 2020-08-19T05:40:47+05:30 IST