మరోసారి క్రిష్ చిత్రానికి...
ABN , First Publish Date - 2020-08-19T05:40:47+05:30 IST
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ‘వేదం’, ‘యన్.టి.ఆర్’ బయోపిక్ రెండు భాగాలకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. మరోసారి వీళ్లిద్దరూ...
![మరోసారి క్రిష్ చిత్రానికి...](https://media.chitrajyothy.com/appimg/galleries/2020081912091342/08192020001040n3.jpg)
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ‘వేదం’, ‘యన్.టి.ఆర్’ బయోపిక్ రెండు భాగాలకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. మరోసారి వీళ్లిద్దరూ కలిసి పని చేస్తున్నారు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుగుతోంది. సినిమా అంతా అటవీ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. పవన్కల్యాణ్ హీరోగా క్రిష్ చేస్తున్న చిత్రానికీ కీరవాణి సంగీతం అందిస్తారని వినికిడి.