మార్చి 6న `ఓ పిట్ట క‌థ` ట్రీట్ సిద్ధం

ABN , First Publish Date - 2020-02-16T13:20:27+05:30 IST

అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా న‌టించారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

మార్చి 6న `ఓ పిట్ట క‌థ` ట్రీట్ సిద్ధం

అగ్ర నిర్మాణ సంస్థ  భవ్య క్రియేషన్స్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా న‌టించారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన టీజర్ కి అద్భుత స్పంద‌నవ‌చ్చింది. `ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే..` అంటూ సాగే మెలోడీ పాటను `బుట్టబొమ్మ‌` పూజా హెగ్డే  చేతుల‌మీదుగా వేలెంటైన్స్ డే రోజున విడుద‌ల చేయ‌గా ఫీల్ గుడ్సాంగ్  అన్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌లో ఓ ఆస‌క్తి క‌ర‌ సంగ‌తిని నిర్మాత  ఆనంద ప్ర‌సాద్ వెల్ల‌డించారు. 


ఆనంద్ ప్ర‌సాద్ మాట్లాడుతూ-``ఈ పాట‌ను అమ‌లాపురం, కాకినాడ ప‌రిస‌రాల్లో చిత్రీక‌రించాం. పాట చిత్రీక‌ర‌ణ‌లో  ఓ త‌మాషా ఉంది. మూవీలో స‌న్నివేశం మూడ్ కి త‌గ్గ‌ట్టుగా అక్కడ లొకేష‌న్ల‌లో విజువ‌ల్స్ ని తెర‌కెక్కించాం. తొలుత‌ విజువ‌ల్స్ షూట్ చేశాకే హైద‌రాబాద్ లో ట్యూన్ క‌ట్టాం. ఇలా ఇంత‌కుముందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంశీ `లేడీస్టైల‌ర్` కోసం 'ఎక్కడ ఎక్కడ  దాక్కున్నావే..'  పాటలో ప్ర‌యోగం చేశారు. విజువ‌ల్స్ షూట్ చేసాక  ఇళ‌య‌రాజాతో  ఆ బాణీని సిద్ధం చేయించారు వంశీ గారు. ఆ తరహాలోనే మేం  చేసిన  ప్ర‌యోగం  అంద‌రినీ ఆక‌ట్టుకుంటుందని భావిస్తున్నాం. మార్చి 6న సినిమాని రిలీజ్ చేస్తున్నాం`` అని తెలిపారు. దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ ``ఒక విలేజ్‌లో జరిగే క‌థ‌ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను క‌లిగిస్తుంది. పతాకసన్నివేశాల వరకూ అదే థ్రిల్ కొన‌సాగుతుంది. ట్విస్టులు థ్రిల్‌ కలిగిస్తాయి. స్క్రీన్‌ ప్లే  ప్రధానంగా తెరకెక్కించాం`` అని అన్నారు.


Updated Date - 2020-02-16T13:20:27+05:30 IST