హీరోయిన్లకు ఛాలెంజ్ విసిరిన నిఖిల్
ABN , First Publish Date - 2020-11-17T22:30:07+05:30 IST
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. సెలబ్రిటీల సపోర్ట్తో ఇప్పుడు దేశమంతా వ్యాపించింది. ఒక్కరు ఈ ఛాలెంజ్లో
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. సెలబ్రిటీల సపోర్ట్తో ఇప్పుడు దేశమంతా వ్యాపించింది. ఒక్కరు ఈ ఛాలెంజ్లో పాల్గొన్ని మరో ముగ్గురుకి ఈ ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ ఛాలెంజ్లో భాగంగా విలక్షణ నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించాడు హీరో నిఖిల్. మంగళవారం ఆయన గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహా సముదాయంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. ''గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసిఆర్గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా బాగుంది. మనం స్టాలిన్ సినిమాలో చూశాం.. ఒకరు ముగ్గురికి సహాయం చేయాలని. అదేవిధంగా ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేయాలనే విధంగా సంతోష్ అన్న చేపట్టిన ఈ కార్యక్రమం చాలా వినూత్నంగా ఉంది. గతంలో కూడా సీడ్ గణేష్ పేరు మీద పర్యావరణ పరిరక్షణ కోసం తన కర్తవ్యాన్ని నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడం కోసం సంతోష్ అన్న చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు పోతుంది. ఈ ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలి. అందుకోసం నేను నా నూతన చిత్రం 18 పేజీలు చిత్ర బృందం సభ్యులకు.. అదేవిధంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, అవికాగోర్, కలర్ స్వాతిలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతున్నాను.." అని తెలిపారు.