తమిళం నేర్చుకుంటోన్న నిధి అగర్వాల్
ABN , First Publish Date - 2020-05-12T14:11:42+05:30 IST
లాక్డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని మన హీరయిన్స్ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ సరసన బెంగుళూరు బ్యూటీ నిధి అగర్వాల్ కూడా చేరింది.
![తమిళం నేర్చుకుంటోన్న నిధి అగర్వాల్](https://media.chitrajyothy.com/appimg/galleries/2020051208382232/05122020084132n86.jpg)
లాక్డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని మన హీరయిన్స్ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ సరసన బెంగుళూరు బ్యూటీ నిధి అగర్వాల్ కూడా చేరింది. ఈ అమ్మడు తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడిప్పుడే తమిళంలోకి అడుగు పెట్టింది. తమిళంలో జయం రవి సరసన భూమి అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ లాక్డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని నిధి అగర్వాల్ తమిళం నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటుంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.