తెలంగాణలో థియేటర్లు తెరవాలంటూ సీఎంకు నట్టి కుమార్ లేఖ
ABN , First Publish Date - 2020-10-25T02:47:56+05:30 IST
థియేటర్లను తెరవకపోవడం వల్ల తెలంగాణలో డైరెక్ట్ గా.. ఇన్డైరెక్టుగా 50 వేల మంది థియేటర్ కార్మికులు రోడ్డున పడ్డారు. వెంటనే థియేటర్లు తెరిచి కార్మికులను ఆదుకోవాలని..

థియేటర్లను తెరవకపోవడం వల్ల తెలంగాణలో డైరెక్ట్ గా.. ఇన్డైరెక్టుగా 50 వేల మంది థియేటర్ కార్మికులు రోడ్డున పడ్డారు. వెంటనే థియేటర్లు తెరిచి కార్మికులను ఆదుకోవాలని.. నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఓ లెటర్ను పంపారు. అపాయింట్మెంట్ ఇస్తే నిర్మాతలు, సినీ కార్మికులు పడుతున్న బాధలను వివరిస్తానని, సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం ఆ నలుగురు నిర్మాతలే కాదని నట్టి కుమార్ ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ లెటర్ను తెలంగాణ సీఎం కేసీఆర్కే కాకుండా కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లకు పంపినట్లుగా ఆయన పేర్కొన్నారు.
ఇంకా ఈ లేఖలో.. '' థియేటర్ లీజు ఓనర్లు... థియేటర్ల కార్మికులకు 8 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టి... వారికి లీజు ఓనర్లు జీతాలిచ్చి ఆదుకునేలా ప్రభుత్వ పెద్దలు ఆదేశించాలని కోరారు. అలానే థియేటర్ల మెయింటైనెన్స్ చార్జీలు రూ.3 నుంచి రూ.7లకు పెంచేలా చూడాలన్నారు. గతంలో కూడా దీనిపై మీకు వినతి పత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు. థియేటర్లు ఈ నెలలు నష్టాల్లో నడుస్తాయి కావున వచ్చే మార్చి వరకు జీఎస్టీ లేకుండా చూడాలని కోరారు. చిన్న సినిమాల నిర్మాతలు సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీగా వున్నారు. కావున తెలంగాణలో వెంటనే థియేటర్లు ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇస్తే మంచిది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ కూడా ఇస్తే రెండు రాష్ట్రాల్లో ఒకే సారి విడుదల చేయడానికి వీలవుతుంది.." అని నట్టికుమార్ పేర్కొన్నారు.



Read more