'నరసింహపురం' ఫస్ట్ లుక్ విడుదల చేసిన తమ్మారెడ్డి
ABN , First Publish Date - 2020-10-27T19:12:06+05:30 IST
వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన 'నరసింహపురం' చిత్రం ఫస్ట్ లుక్ను విజయదశమి సందర్భంగా ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు.
శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో.. గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో 'శ్రీరాజ్ బళ్ళా, టి.ఫణికుమార్ గౌడ్, నందకిశోర్ ధూళిపాల సయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నరసింహపురం'. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్గా, ఉష చెల్లెలు పాత్రలో నటించారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ను విజయదశమి సందర్భంగా ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ "నందు హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరాజ్ బళ్ళా రూపొందించిన 'నరసింహపురం' మంచి విజయం సాధించాలి. నేను పాటలతోపాటు... త్వరలో రిలీజ్ చేసే టీజర్, ట్రైలర్ చూశాను. చాలా బాగా అనిపించాయి" అన్నారు. హీరో నందకిశోర్ మాట్లాడుతూ "కథ మీద ప్రేమతో.. శ్రీరాజ్ పై నమ్మకంతో చేసిన 'నరసింహపురం' మా అందరికీ మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు. దర్శకుడు శ్రీరాజ్ బళ్ళా మాట్లాడుతూ "ఒక సంవత్సరం పాటు మా టీమ్ పడిన కష్టమిది. అందరి సహాయ సహకారాలతో ప్రేక్షకులు మెచ్చేలా 'నరసింహపురం' రూపుదిద్దుకుంది" అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫణిరాజ్, కర్ణ పాల్గొన్నారు.