పోలీసులు చేస్తున్న సేవలు కీర్తించదగినవి: నిర్మాత నాగవంశీ
ABN , First Publish Date - 2020-04-28T21:28:17+05:30 IST
కరోనా నివారణ చర్యలలో భాగంగా లాక్డౌన్లో పోలీసులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు కీర్తించతగినవే అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈరోజు
![పోలీసులు చేస్తున్న సేవలు కీర్తించదగినవి: నిర్మాత నాగవంశీ](https://media.chitrajyothy.com/appimg/galleries/2020042803545915/04282020155734n93.jpg)
కరోనా నివారణ చర్యలలో భాగంగా లాక్డౌన్లో పోలీసులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు కీర్తించతగినవే అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈరోజు (మంగళవారం) సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జనార్కి హ్యాండ్ శానిటైజర్స్, ఫేస్ మాస్క్లను అందించిన ఆయన ప్రజలందరూ ఇంట్లోని ఉండి వారి ప్రాణాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
‘‘కరోనా వైరస్(కోవిడ్ 19) నిర్మూలనకు ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. దీని నివారించడం మన బాధ్యత. అందుకు తీసుకుంటున్న నివారణా చర్యలకు మన వంతు సహకారాన్ని అందించాలి. అందులో భాగంగా మా చిత్ర నిర్మాణ సంస్థలైన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు సితార ఎంటర్ టైన్మెంట్స్’లు సహాయ గ్రూప్తో కలసి ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జనార్గారికి హాండ్ శానిటైజర్స్, ఫేస్ మాస్క్లను ఇవ్వటం జరిగింది. కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవి. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండండి, క్షేమంగా ఉండండి..’’ అని ఆకాంక్షించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.