పునః ప్రారంభమైన నాగ శౌర్య, సితార ఎంటర్టైన్మెంట్స్ చిత్రం
ABN , First Publish Date - 2020-10-12T19:51:29+05:30 IST
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ తో షూటింగ్ ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ చిత్రంలోనదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్,ప్రవీణ్,అనంత్,కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నాగశౌర్య స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీలోనూ నటిస్తున్నారు.
Read more