ఆ పాటకు పాతికేళ్లు.. నాగ్ ట్వీట్
ABN , First Publish Date - 2020-05-13T18:11:36+05:30 IST
నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ నటించిన చిత్రం ‘క్రిమినల్’. ఈ సినిమా విడుదలై పాతికేళ్లు అవుతుంది. మహేశ్ భట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది.
![ఆ పాటకు పాతికేళ్లు.. నాగ్ ట్వీట్](https://media.chitrajyothy.com/appimg/galleries/2020051312352264/05132020124053n44.jpg)
నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ నటించిన చిత్రం ‘క్రిమినల్’. ఈ సినిమా విడుదలై పాతికేళ్లు అవుతుంది. మహేశ్ భట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. సినిమాలోని పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. ముఖ్యంగా ‘తెలుసా మనసా..’ ఎవర్గ్రీన్ హిట్ సాంగ్గా నిలిచింది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా బాలు చిత్ర ఆ పాటను పాడారు. సినిమా విడుదలై పాతికేళ్లు అవుతున్న సందర్భంగా అనూప్ శంకర్ ఈ పాటను తెలుగు, హిందీ భాషల్లో పాడి నిస్వార్ధంగా సమాజానికి సేవ చేస్తున్న హృదయాలకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. దీనిపై హీరో నాగార్జున కూడా స్పందించారు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న పాటను నిస్వార్ధంగా సేవ చేస్తున్న వారికి అంకితమివ్వడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.