హిమాలయాల్లో నాగార్జున!
ABN , First Publish Date - 2020-10-23T22:45:18+05:30 IST
`కింగ్` నాగార్జున ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్నారు.

`కింగ్` నాగార్జున ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్నారు. తన కొత్త చిత్రం `వైల్డ్ డాగ్` షూటింగ్ కోసం నాగార్జున అక్కడకు వెళ్లారు. తాజాగా రోహ్తంగ్ పాస్లో తీసిన వీడియోను నాగార్జున ట్విటర్లో షేర్ చేశారు. సముద్ర మట్టానికి 3980 మీటర్ల ఎత్తులో తాము ఉన్నామని, ఇది చాలా డేంజరస్ ప్రాంతమని నాగార్జున పేర్కొన్నారు.
నవంబర్ నుంచి మే వరకు ఆ ప్రదేశాన్ని మూసేస్తారని, `వైల్డ్ డాగ్` షూటింగ్ ఇక్కడ ప్రస్తుతం చాలా బాగా జరుగుతోందని తెలిపారు. ఏడు నెలల తర్వాత ఇలాంటి అద్భుతమైన ప్లేస్కు రావడం చాలా ఆనందంగా ఉందని, 21 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తామని పేర్కొన్నారు. అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగార్జున గైర్హాజరీలో `బిగ్బాస్-4` వీకెండ్ కార్యక్రమాన్ని ఎవరు హోస్ట్ చేస్తారో చూడాలి.