రాజేష్‌వి అసత్య ఆరోపణలు: మైత్రీ మూవీ మేకర్స్

ABN , First Publish Date - 2020-08-27T23:15:33+05:30 IST

‘ఆచార్య’పై రాజేష్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు అసత్యమని, మేము అతని కథకు అన్నయ్య అనే పేరు పెట్టాలని కొరటాల శివకు తెలియజేశామని చెప్పడం అబద్దమని, అతని

రాజేష్‌వి అసత్య ఆరోపణలు: మైత్రీ మూవీ మేకర్స్

‘ఆచార్య’పై రాజేష్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు అసత్యమని, మేము అతని కథకు అన్నయ్య అనే పేరు పెట్టాలని కొరటాల శివకు తెలియజేశామని చెప్పడం అబద్దమని, అతని ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నామని తెలియజేశారు మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాతలు. గతంలో మేము నూతన దర్శకులతో ‘డియర్‌ కామ్రేడ్‌’ (భరత్‌కమ్మ), ‘మత్తువదలరా’ (రితేష్‌రానా), ప్రస్తుతం ‘ఉప్పెన’ (బుబ్చిబాబు సానా) సినిమాలను నిర్మించాం. రాజేష్‌ మాకు వినిపించిన కథ బాగుంటే అతనితో కూడా సినిమా నిర్మించేవాళ్లం. కథ బాగాలేకపోవడంతో అతని కథను తిరస్కరించాం. 


ఇక బాలేని కథతో వేరే వారికి సినిమా నిర్మించాలని ఎందుకు చెబుతాం? దర్శకుడిగా, రచయితగా కొరటాల శివ ప్రతిభ గురించి అందరికీ తెలుసు. కమర్షియల్‌ అంశాలతో పాటు తన ప్రతి సినిమాలో సామాజిక ప్రయోజనం కూడా జోడించే కొరటాల శివగారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా అర్థరహితమైన ఆరోపణలు చేయడం సరికాదు. మీడియాలో రాజేష్‌ చేసిన ఆరోపణలు ఖండించడంతో పాటు ఆయనపై తగిన చర్యలు తీసుకుంటాం. రాజేష్‌ చేసిన చౌకైన జిమ్మిక్కులను, అతని ఆరోపణలను అందరూ విస్మరించాలని కోరుకుంటున్నాం.. అని మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాతలు తెలిపారు.



Updated Date - 2020-08-27T23:15:33+05:30 IST