కోటి కుమారుడు హీరోగా...
ABN , First Publish Date - 2020-10-27T06:31:17+05:30 IST
సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ హీరోగా కె. శివ వరప్రసాద్ దర్శకత్వంలో ఎం. సుధాకర్రెడ్డి నిర్మిస్తున్న నూతన చిత్రం విజయదశమి...
![కోటి కుమారుడు హీరోగా...](https://media.chitrajyothy.com/appimg/galleries/2020102712571271/10272020010117n89.jpg)
సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ హీరోగా కె. శివ వరప్రసాద్ దర్శకత్వంలో ఎం. సుధాకర్రెడ్డి నిర్మిస్తున్న నూతన చిత్రం విజయదశమి సందర్భంగా ప్రారంభమైంది. ‘‘నవంబర్ నుంచి హైదరాబాద్లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు అన్నారు. ‘‘సంగీతానికి సినిమాలో చాలా ప్రాముఖ్యం ఉంది. కోటిగారు సంగీతం అందిస్తుండటం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత చెప్పారు. ‘రంగస్థలం’ మహేశ్, రాకేందు మౌళి, ‘కంచెరపాలెం’ రాజు, టిఎన్ఆర్ ఇందులో ముఖ్య పాత్రధారులు.