కంగనాకు షాక్..!

ABN , First Publish Date - 2020-09-08T17:59:43+05:30 IST

బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న క్వీన్ కంగనాకు బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ షాకిచ్చింది. ఆమెకు చెందిన...

కంగనాకు షాక్..!

కంగనాకు షాక్.. మణికర్ణిక కార్యాలయం కూల్చబోతున్నారా..?

ముంబై: బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న క్వీన్ కంగనాకు బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ షాకిచ్చింది. ఆమెకు చెందిన పాళి హిల్ బంగళాకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోకుండా మార్పులుచేర్పులు చేశారని పేర్కొంటూ అధికారులు ఆ బంగళా గేటుకు నోటీసులు అంటించారు. ఈ బంగళాను ‘మణికర్ణిక కార్యాలయం’ పేరుతో కంగనా కట్టించుకుంది. తన సొంత ఆఫీస్‌గా ప్రకటించి అక్కడ నుంచే సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది.


అయితే.. తన కార్యాలయాన్ని కూల్చబోతున్నట్లు కంగనా ఇప్పటికే ప్రకటించింది. ఆమె ఆఫీస్‌లో బీఎంసీ అధికారులు ఉన్నట్లు ఓ వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ కంగనా వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే ఆమె కార్యాలయంలో బీఎంసీ అధికారులు కనిపించడం గమనార్హం. తన అనుమతి లేకుండా కార్యాలయంలోకి అధికారులు వెళ్లారని, కొలతలు తీసుకున్నారని.. కంగనా వీడియోలో స్పష్టం చేసింది.


ముంబైపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అధికార శివసేనకు, ఆమెకు మధ్య చిచ్చు పెట్టాయి. సుశాంత్ కేసులో న్యాయం జరగాలని, ముంబై పోలీసులపై నమ్మకం లేదని.. సీబీఐకి సుశాంత్ కేసును అప్పగించాలని గతంలో కూడా ఆమె వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు.


ముంబైపై, మహారాష్ట్రపై, మరాఠాలపై మితిమీరి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కంగనాను హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు కూడా కంగనా కౌంటర్ ఇస్తూ.. తాను సెప్టెంబర్ 9న ముంబైకి వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్ చేసింది. దీంతో.. కంగనాకు, శివసేన ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే.. కంగనా కార్యాలయాన్ని కూల్చాలని నిర్ణయించి.. ఉద్దేశపూర్వకంగా బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు అంటించిందని ఆమె మద్దతుదారులు మండిపడుతున్నారు.





Updated Date - 2020-09-08T17:59:43+05:30 IST