రాజమౌళి క్లాప్తో ప్రారంభమైన కీరవాణి తనయుని రెండో చిత్రం
ABN , First Publish Date - 2020-10-26T03:33:26+05:30 IST
సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి తనయుడు 'మత్తు వదలరా' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీసింహా హీరోగా తొలి చిత్రంతో మంచి పేరే

సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి తనయుడు 'మత్తు వదలరా' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీసింహా హీరోగా తొలి చిత్రంతో మంచి పేరే తెచ్చుకున్నాడు. కీరవాణి మరో తనయుడు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహాపై దృష్టి పెట్టింది కీరవాణి ఫ్యామిలీ. తాజాగా శ్రీసింహా రెండో చిత్రం ప్రారంభమైంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి క్లాప్ కొట్టి.. ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. కీరవాణి స్ర్కిఫ్ట్ని చిత్రయూనిట్కు అందించారు.
వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీసింహా సరసన చిత్రా శుక్లా, మిశ్రా నారంగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి కొర్రపాటి ప్రొడక్షన్లో రజినీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
