షూటింగ్లో కుప్పకూలిన మిథున్ చక్రవర్తి!
ABN , First Publish Date - 2020-12-21T19:34:23+05:30 IST
బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు.

బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి కారణంగా షూటింగ్ స్పాట్లోనే కుప్పకూలిపోయారు. మిథున్ చక్రవర్తి ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ది కశ్మీర్ ఫైల్స్` సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది.
షూటింగ్ సమయంలో కడుపునొప్పి కారణంగా ఆరోగ్యం క్షీణించి మిథున్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చిత్రీకరణను నిలిపివేశారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ విషయాన్ని తెలియజేశారు. భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో మిథున్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడని, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కళ్లు తిరిగి పడిపోయాడని తెలిపారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ వచ్చి షూటింగ్లో పాల్గొన్నారని తెలిపారు.
Read more