మెగా-మంచు దీపావళి సెలబ్రేషన్స్!

ABN , First Publish Date - 2020-11-17T19:32:48+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం గురించి తెలిసిందే.

మెగా-మంచు దీపావళి సెలబ్రేషన్స్!

మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం గురించి తెలిసిందే. వీరు మాత్రమే కాకుండా వీరి వారసులు కూడా అంతే స్నేహంగా ఉంటారు. తరచుగా ఫంక్షన్లు, పార్టీలలో కలిసి సందడి చేస్తుంటారు. 


తాజాగా దీపావళి సెలబ్రేషన్స్‌లో రామ్‌చరణ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్ కలిసి సందడి చేశారు. చెర్రీ చేత మనోజ్ కేక్ కట్ చేయించాడు. ఆ ఫొటోను మనోజ్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. రామ్‌చరణ్, అక్క మంచు లక్ష్మితో దీపావళి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నానని మనోజ్ కామెంట్ చేశాడు. 




Updated Date - 2020-11-17T19:32:48+05:30 IST