వైష్ణవ్.. రకుల్.. క్రిష్!

ABN , First Publish Date - 2020-08-14T21:27:17+05:30 IST

తొలి సినిమా `ఉప్పెన` విడుదల కాకముందే మెగా ఫ్యామిలీ హీరో `పంజా` వైష్ణవ్ తేజ్ మరో మంచి అవకాశం దక్కించుకున్నాడు

వైష్ణవ్.. రకుల్.. క్రిష్!

తొలి సినిమా `ఉప్పెన` విడుదల కాకముందే మెగా ఫ్యామిలీ హీరో `పంజా` వైష్ణవ్ తేజ్ మరో మంచి అవకాశం దక్కించుకున్నాడు. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ రోజు (శుక్రవారం) ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 


ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ చివరి కల్లా ఈ సినిమాను పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నారు. ఆ తర్వాత నెల నవంబర్ నుంచి పవన్ కల్యాణ్ సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్నారు. 

Updated Date - 2020-08-14T21:27:17+05:30 IST