కరోనాతో ప్రముఖ నటుడి మృతి!
ABN , First Publish Date - 2020-09-24T14:06:32+05:30 IST
కరోనా మరో ప్రముఖ నటుడిని బలి తీసుకుంది. ఎన్నో సినిమాల్లో కమెడియన్గా నటించిన కోసూరి వేణుగోపాల్ కరోనా కారణంగా కన్నుమూశారు
![కరోనాతో ప్రముఖ నటుడి మృతి!](https://media.chitrajyothy.com/appimg/galleries/202009240835053/09242020083622n50.jpg)
కరోనా మరో ప్రముఖ నటుడిని బలి తీసుకుంది. ఎన్నో సినిమాల్లో కమెడియన్గా నటించిన కోసూరి వేణుగోపాల్ కరోనా కారణంగా కన్నుమూశారు. గత 22 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్న వేణుగోపాల్ బుధవారం రాత్రి మరణించారు. కరోనా నెగిటివ్ వచ్చాక కూడా ఆయన అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు.
నర్సాపురంకు చెందిన వేణుగోపాల్ ఎఫ్సీఐ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. దాదాపు 27 సంవత్సరాలుగా నటిస్తున్న ఆయన `పిల్ల జమిందార్`, `మర్యాద రామన్న`, `విక్రమార్కుడు`, `అమీతుమీ`, `ఛలో` తదితర చిత్రాలలో నటించారు. ఆయన ఆకస్మిక మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు నటులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.