కరోనాతో ప్రముఖ నటుడి మృతి!

ABN , First Publish Date - 2020-09-24T14:06:32+05:30 IST

కరోనా మరో ప్రముఖ నటుడిని బలి తీసుకుంది. ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటించిన కోసూరి వేణుగోపాల్ కరోనా కారణంగా కన్నుమూశారు

కరోనాతో ప్రముఖ నటుడి మృతి!

కరోనా మరో ప్రముఖ నటుడిని బలి తీసుకుంది. ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటించిన కోసూరి వేణుగోపాల్ కరోనా కారణంగా కన్నుమూశారు. గత 22 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న వేణుగోపాల్ బుధవారం రాత్రి మరణించారు. కరోనా నెగిటివ్ వచ్చాక కూడా ఆయన అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. 


నర్సాపురంకు చెందిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. దాదాపు 27 సంవత్సరాలుగా నటిస్తున్న ఆయన `పిల్ల జమిందార్`, `మర్యాద రామన్న`, `విక్రమార్కుడు`, `అమీతుమీ`, `ఛలో` తదితర చిత్రాలలో నటించారు. ఆయన ఆకస్మిక మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు నటులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-09-24T14:06:32+05:30 IST