మాస్ మహా రాజ్ వీరాభిమానిగా ‘కొంటె కుర్రాడు’
ABN, First Publish Date - 2020-04-06T18:06:09+05:30
ఎస్.ఎమ్.ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్లో రవితేజ అభిమాని ఎమ్.ఎన్.వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కొంటె కుర్రాడు’.
ఎస్.ఎమ్.ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్లో రవితేజ అభిమాని ఎమ్.ఎన్.వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కొంటె కుర్రాడు’. ఓ లోఫర్గాడి ప్రేమ కథ అనేది ఉపశీర్షిక. మాస్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా లో గాయత్రి పటేల్ హీరోయిన్గా నటిస్తుంది. రెండు మనసులు కలిసుండటం ఇష్టం లేక రెండు కుటుంబాలు చేసే యుద్ధమే ఈ ప్రేమకథ. హైదరాబాద్, రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని దర్శకుడన్నారు.