ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత!

ABN , First Publish Date - 2020-11-04T19:46:48+05:30 IST

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది

ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత!

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. పలు తెలుగు, తమిళ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన కోలా భాస్కర్ (55) అనారోగ్యంతో కన్నుమూశారు. కోలా భాస్కర్ కొంతకాలంగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్నారు. 


హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (బుధవారం) ఉదయం తుది శ్వాస విడిచారు. `ఖుషి`, `7/జీ బృందావన్ కాలనీ`, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`, ‘3’, ‘కుట్టి’ వంటి చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. కోలా భాస్కర్ అకాల మరణం టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

Updated Date - 2020-11-04T19:46:48+05:30 IST

Read more