ఆ సినిమా స్క్రిప్టును ఏడు రోజుల్లో పూర్తి చేశా: కమల్ హాసన్
ABN , First Publish Date - 2020-06-13T23:28:09+05:30 IST
ఐదు జాతీయ అవార్డులు దక్కించుకుని సంచలనం సృష్టించిన `దేవర్ మగన్` (తెలుగులో క్షత్రియ పుత్రుడు) సినిమా కథను కేవలం ఏడు రోజుల్లో

ఐదు జాతీయ అవార్డులు దక్కించుకుని సంచలనం సృష్టించిన `దేవర్ మగన్` (తెలుగులో క్షత్రియ పుత్రుడు) సినిమా కథను కేవలం ఏడు రోజుల్లో రాశానని విశ్వనటుడు కమల్ హాసన్ తాజాగా వెల్లడించారు. 1992లో విడుదలైన ఈ సినిమాలో కమల్తో పాటు శివాజీ గణేషన్, రేవతి కీలకపాత్రల్లో నటించారు. తాజాగా ఏఆర్ రెహ్మాన్తో కలిసి సోషల్ మీడియా లైవ్ఛాట్లో పాల్గొన్న కమల్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
``దేవర్ మగన్` దర్శకుడు, నా స్నేహితుడు భరతన్ నాతో సవాల్ చేశాడు. స్క్రిప్టును త్వరగా పూర్తి చేయకపోతే సినిమా నుంచి తప్పుకుంటానని బెదిరించాడు. అతి తక్కువ సమయంలో స్క్రిప్టు రాస్తానని చెప్పాను. చెప్పినట్టుగానే ఏడు రోజుల్లో మొత్తం స్క్రిప్టు సిద్ధం చేశాను. అయితే అన్నీ అలా రాయాలంటే కుదరదు. కొన్నింటికి సంవత్సరం కూడా పట్టొచ్చ`ని కమల్ చెప్పారు.