సీసీసీకి కాజల్ విరాళం!
ABN , First Publish Date - 2020-04-16T19:41:44+05:30 IST
లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే
లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ ఛారిటీకి పలువురు సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు.
తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. రూ.2 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. ఆర్టీజీఎస్ ద్వారా సీసీసీకి డబ్బు అందించినట్టు కాజల్ మేనేజర్ తెలిపారు.