కంగనకు మరో షాక్!

ABN , First Publish Date - 2020-11-04T16:24:17+05:30 IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు మరో షాక్.

కంగనకు మరో షాక్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు మరో షాక్. ఇప్పటికే పోలీసు కేసులతో సతమతమవుతున్న కంగనపై బాలీవుడ్ సీనియర్ రచయిత జావేద్ అక్తర్ పరువు నష్టం దావా వేశారు. హృతిక్ రోషన్ వ్యవహారంలో తనను ఇరికిస్తూ కంగన తనపై నిరాధార ఆరోపణలు చేసిందని పేర్కొంటూ అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు జావేద్ అక్తర్ ఓ కేసు వేశారు. చట్ట ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. 


హృతిక్ రోషన్ కుటుంబంతో కుమ్మక్కై జావేద్ అక్తర్ తనను ఇంటికి పిలిచి బెదిరించారని, హృతిక్ కుటుంబానికి క్షమాపణ చెప్పకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారని కొద్ది రోజుల క్రితం కంగన ఆరోపించింది. సినీ పరిశ్రమలో రాకేష్ రోషన్ పెద్ద మనిషని, అతనితో పెట్టుకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని జావేద్ అన్నట్టు కంగన తెలిపింది. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కంగనపై జావేద్ తాజాగా కోర్టుకెక్కారు. ఇదిలా ఉండగా, ముంబైలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై కంగన, ఆమె సోదరి రంగోలికి ముంబైలోని బాంద్రా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు.


Updated Date - 2020-11-04T16:24:17+05:30 IST