ఎంపీ సంతోష్ బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటిన సంజయ్ దత్

ABN , First Publish Date - 2020-12-08T00:11:46+05:30 IST

పర్యావరణ రక్షణపై అవగాహన, ప్రకృతి పట్ల ప్రేమ అందరిలో పెరగాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ బర్త్ డే..

ఎంపీ సంతోష్ బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటిన సంజయ్ దత్

హైదరాబాద్: పర్యావరణ రక్షణపై అవగాహన, ప్రకృతి పట్ల ప్రేమ అందరిలో పెరగాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ బర్త్ డే సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి సంజయ్ దత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంజయ్ దత్ మాట్లాడుతూ మొక్కలు నాటడం, పెంచటం అందరి జీవన విధానం కావాలన్నారు. 


గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముంబైలోనూ చేస్తామని చెప్పారు. ఈ ఛాలెంజ్‌లో తన అభిమానులు, సన్నిహితులు పాల్గొంటారని తెలిపారు.  ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న సవాళ్లలో పర్యావరణ రక్షణే అతి పెద్దదన్నారు. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే ఉన్న అడవులను కాపాడుకోవటంతో పాటు కొత్తగా పెద్ద ఎత్తున పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉందని సంజయ్ దత్ అన్నారు. 


తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటిన అందరికీ ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిఒక్కరూ తాము నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవటంతో పాటు మరో ముగ్గురితో నాటించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చైన్‌ను కొనసాగిస్తూ దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే సంస్కృతి పెరిగేలా చూడాలని సంతోష్ కుమార్ కోరారు. 

Updated Date - 2020-12-08T00:11:46+05:30 IST