దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం
ABN , First Publish Date - 2020-08-02T05:50:29+05:30 IST
దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి శేషయ్య కమ్ముల(90) కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు...
![దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం](https://media.chitrajyothy.com/appimg/galleries/2020080212165766/08022020002019n7.jpg)
దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి శేషయ్య కమ్ముల(90) కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖలో డీఐజీగా పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. అనంతరం న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. శేషయ్యకు నలుగురు సంతానం కాగా అందులో శేఖర్ కమ్ముల చివరివాడు. శేషయ్య అంత్యక్రియలు శనివారం బన్సీలాల్పేట్లోని హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు. కరోనా లాక్డౌన్ నిబంధనల మేరకు కొద్దిమంది కుటుంబసభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.
ఆంధ్రజ్యోతి, పద్మారావునగర్