పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు ఈ చిత్రం అంకితం: ‘తెరవెనుక’‌ దర్శకుడు

ABN , First Publish Date - 2020-12-30T22:53:01+05:30 IST

1996లో అలీ, ఇంద్రజ హీరోహీరోయిన్లుగా నటించిన 'పిట్టలదొర' సినిమా ద్వారా నృత్య దర్శకునిగా పరిచయమై.. 2013 లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా బెల్ చిత్రం ద్వారా

పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు ఈ చిత్రం అంకితం: ‘తెరవెనుక’‌ దర్శకుడు

1996లో అలీ, ఇంద్రజ హీరోహీరోయిన్లుగా నటించిన 'పిట్టలదొర' సినిమా ద్వారా నృత్య దర్శకునిగా పరిచయమై.. 2013 లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా బెల్  చిత్రం ద్వారా దర్శకుడుగా కెరీర్ మొదలు పెట్టి.. 2015 లో ధన్‌రాజు, దీక్షాపంత్, షకలక శంకర్, సుడిగాలి సుధీర్ కాంబినేషన్‌లో వచ్చిన బంతిపూల జానకి వంటి చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు వెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌. ఇప్పుడాయన రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా విజయలక్ష్మి మురళి మచ్చ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన చిత్రం 'తెరవెనుక'. ఈ సినిమా నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా దర్శకుడు వెల్లుట్ల ప్రవీణ్ చందర్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు.


ఆయన మాట్లాడుతూ.. '' డిఫరెంట్ స్ర్కీన్‌ప్లేతో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం 'తెర వెనుక'. ఏపీ, తెలంగాణలో రెండు వందల సినిమా థియేటర్లలో ఈ సినిమాను నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేస్తున్నాం.  క్రైమ్ థ్రిల్లర్ సోషల్ కాజ్‌గా వస్తున్న ఈ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ తమ్ముడు ఆమన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఒక డిఫరెంట్ స్ర్కీన్‌ప్లేతో ఇప్పుడున్న పరిస్థితులకు తగినట్లుగా..ఆడవాళ్ళపై జరుగుతున్న  క్రైమ్స్‌ను ఈ చిత్రం ద్వారా కొత్తగా చూపిస్తున్నాం. ప్రస్తుతం 101, షి టీములు ఎన్ని ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రతి మనిషికి స్వీయ రక్షణ ఇంపార్టెంట్ అని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం. ఎవ్వరూ ఊహించని పాయింట్లు ఇందులో చూపించాము. సబ్జెక్ట్ పాతదే అయినా చెప్పే విధానం కొత్తగా ఉంటే  ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా ఈ సినిమాను కొత్తగా తీయడం జరిగింది. ఇందులో 4 పాటలు ఉంటాయి. 45 రోజుల్లో సినిమాను పూర్తి చేసాం. హీరో  ఆమన్ చాలా చక్కగా నటించాడు. శ్వేతా వర్మ ఇందులో డీజీపీగా చేసిన పోలీస్ క్యారెక్టర్ ఈ సినిమాకే హైలెట్ అవుతుంది. మా సినిమా పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై ఉంటుంది. మాకు పోలీస్ స్టార్స్ గురించి కూడా తెలియదు. అందుకే రిటైర్డ్ డి.ఎస్.పి సహకారం తీసుకుని డిపార్ట్‌మెంట్‌ పరంగా ఎంతో శ్రద్ధ పెట్టి ఈమూవీని తీయడం జరిగింది. రియల్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు బట్టలు, క్యాపు,షూస్ ఎవరు కుడతారో వారితోనే కుట్టించాము. పోలీసు వారి క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, ఎలా ఉంటాయి, వారు ఎలా చేస్తారు అనేది ఇందులో చూపించాము.


హీరోహీరోయిన్స్ ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్. వారి మధ్య జరిగే లవ్ స్టోరీ, ఒక క్రైమ్‌కి అనుబంధమై ఉంటుంది. ఆ క్రైమ్‌ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది ఈ చిత్ర కథాంశం. ఇది ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫిల్మ్‌. ఇండియాలో చాలా చోట్ల జరిగిన క్రైమ్స్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. ఇండస్ట్రీ నుంచి రకుల్ ప్రీత్, సందీప్ కిషన్, మంచు లక్ష్మి, శివారెడ్డి, కాసర్ల శ్యామ్ వంటి ప్రముఖులు మా సినిమాకు సపోర్ట్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు డెడికేట్ చేస్తున్నాము. ప్రస్తుతం కరోనా ప్రాబ్లమ్‌తో థియేటర్లలో 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉన్నా.. కమర్షియల్, మెసేజ్ ఓరియెంటెడ్‌గా వస్తున్న మా చిత్రం కొంతమందికైనా రీచ్ అయితే చాలు. ప్రేక్షకులు బిగ్ స్ర్కీన్‌కు కనెక్ట్ అయినట్టుగా ఓ.టి.టి., ఏ టి.టి. వంటి స్మాల్ స్ర్కీన్‌కు కనెక్ట్ కారని మా నిర్మాత చెప్పడంతో థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న వస్తున్న మా 'తెరవెనుక' చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.." అని తెలిపారు.

Updated Date - 2020-12-30T22:53:01+05:30 IST