‘లోకల్ బాయ్’ వస్తున్నాడు
ABN , First Publish Date - 2020-02-18T04:11:36+05:30 IST
ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘పటాస్’. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. మెహరీన్
![‘లోకల్ బాయ్’ వస్తున్నాడు](https://media.chitrajyothy.com/appimg/galleries/2020021710391656/02172020224122n17.jpg)
ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘పటాస్’. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్. స్నేహ మరో హీరోయిన్. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘ఎవరు’ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన నవీన్ చంద్ర విలన్ పాత్ర పోషించారు. తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సీహెచ్ సతీష్కుమార్ విడుదల చేస్తుస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ధనుష్ మార్షల్ ఆర్ట్స్లో స్పెషల్ ట్రయినింగ్ తీసుకున్నారు. ప్రాచీన యుద్ధవిద్య అడిమురై గొప్పదనం వివరించే చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్కి మంచి స్పందన లభించింది. ఈ నెల 28న విడుదలవుతున్న సినిమా కూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. మెహరీన్, స్నేహ, నవీన్ చంద్ర, నాజర్.. సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు ఎక్కువ. తెలుగు సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ధనుష్, ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ధర్మ యోగి’ తెలుగులో మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని తెలుగులో మేమే విడుదల చేశాం. ఇప్పుడు ఈ సినిమానూ మేమే విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది’’ అని అన్నారు.