రాజు సుందరం, లారెన్స్లకు ఛాలెంజ్ విసిరిన రఘు మాస్టర్
ABN , First Publish Date - 2020-12-27T23:50:26+05:30 IST
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. నిత్యం ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంది. ప్రముఖులు ఈ ఛాలెంజ్ను స్వీకరించి, మొక్కలు
![రాజు సుందరం, లారెన్స్లకు ఛాలెంజ్ విసిరిన రఘు మాస్టర్](https://media.chitrajyothy.com/appimg/galleries/2020122706152539/12272020181828n1.jpg)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. నిత్యం ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంది. ప్రముఖులు ఈ ఛాలెంజ్ను స్వీకరించి, మొక్కలు నాటి.. మరికొందరినీ ఇందులో భాగం చేస్తున్నారు. డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇటీవల మొక్కలు నాటి.. ఈ ఛాలెంజ్ను స్వీకరించాల్సిందిగా డ్యాన్స్ మాస్టర్ రఘును కోరారు. శేఖర్ మాస్టర్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పార్క్ లో మొక్కలు నాటారు రఘు మాస్టర్.
ఈ సందర్భంగా రఘు మాస్టర్ మాట్లాడుతూ... ''నేను తీసుకునే ఆక్సిజన్ కోసం నా వంతు బాధ్యతగా ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ.. వారు పీల్చుకునే ఆక్సిజన్ కోసం 3 మొక్కలు నాటాలని కోరుతున్నాను. ఈరోజు మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉంది. కరోనా వైరస్ లాంటి ఈ సందర్భంలో మనం వాతావరణాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యత. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని కోరుతూ.. నా వంతుగా మరో ముగ్గురిని నేను నామినేట్ చేస్తున్నాను. మా గురువు రాజు సుందరం మాస్టర్, మిత్రుడు రాఘవ లారెన్స్ మాస్టర్, నా భార్య గాయని ప్రణవి ఆచార్యను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతున్నాను..'' అని తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు "వృక్ష వేదం" పుస్తకంను రఘు మాస్టర్ కి అందజేశారు.