జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఓటు వేసిన సినీ ప్రముఖులు
ABN , First Publish Date - 2020-12-01T13:40:58+05:30 IST
హైదరాబాద్ బల్దియా బాద్షా ఎవరో నిర్ణయించే ఎన్నికలు ప్రారంభమైయాయి. 150 డివిజన్స్లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కను వినియోగించుకుంటున్నారు.

హైదరాబాద్ బల్దియా బాద్షా ఎవరో నిర్ణయించే ఎన్నికలు ప్రారంభమైయాయి. 150 డివిజన్స్లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
* మెగాస్టార్ చిరంజీవి, సతీమణి సురేఖతో కలిసి జూబ్లీక్లబ్లో ఓటు హక్కును వియోగించుకున్నారు
* అక్కినేని నాగార్జున, అమల జూబ్లీహిల్స్ లో ఓటు హక్కను వినియోగించుకున్నారు
* ప్రముఖ నిర్మాత శ్యామ్ప్రసాద్ రెడ్డి ఎఫ్ఎన్సీసీలో ఓటు వేశారు.
* లక్మీ మంచు ఎఫ్ఎన్సీసీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు
* సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ దంపతులు ఓటు వేశారు. అందరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు
* నిర్మాత ఉషా ముల్పూరి షేక్ పేటలో తన ఓటు హక్కను వినియోగించుకున్నారు
* విజయ్ దేవరకొండ సహా ఆయన కుటుంబ సభ్యులు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లో ఓటు వేశారు
* డైరెక్టర్ తేజ, కోట శ్రీనివాస రావు, రైటర్ బీవీఎస్ రవి ఓటు వేశారు
Read more